Car Accident In Rangareddy : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో కారు బోల్తా పడి పదో తరగతి విద్యార్థి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు విద్యార్థులు క్రికెట్ ఆడేందుకు మైదానానికి వెళ్లేందుకు కొత్తపల్లి నుంచి కారులో బయలుదేరారు. శంకరపల్లికి చేరుకోగానే అదుపు తప్పి కారు బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
మండలంలోని కొత్తపల్లికి చెందిన రామస్వామికి సంతానం లేకపోవడంతో బంధువులకు చెందిన విగ్నేష్ను చిన్నతనంలో దత్తత తీసుకున్నాడు. కాగా ప్రమాదంలో విగ్నేష్ మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. డ్రైవింగ్ సరిగా రాని మైనర్ విద్యార్థులకు కారు ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తోన్నారు. కారు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.