ETV Bharat / snippets

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 7:06 PM IST

delhi_liquor_scam.
delhi_liquor_scam. (Etv Bharat)

Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీచేశారు. కవిత కస్టడీ కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి ఆమెను వీసీ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలన్న సీబీఐ విజ్ఞప్తిని కవిత తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, బెయిల్‌ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనలు వినిపించారు. వారి వాదనలను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తి ఆమె కస్టడీని పొడిగించారు. కవితకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై కోర్టు శనివారం విచారించి నిర్ణయం వెలువరించనుంది.

Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీచేశారు. కవిత కస్టడీ కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి ఆమెను వీసీ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలన్న సీబీఐ విజ్ఞప్తిని కవిత తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, బెయిల్‌ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనలు వినిపించారు. వారి వాదనలను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తి ఆమె కస్టడీని పొడిగించారు. కవితకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై కోర్టు శనివారం విచారించి నిర్ణయం వెలువరించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.