Army Jawan Suicide In Vikarabad : వికారాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట చింటు అనే వ్యక్తి గుండాల్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు ఆమెకు చెప్పాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన కుటుంబ సభ్యులకు యువతి చెప్పగా కోపానికి గురైన చింటూను కొట్టేందుకు ప్రయత్నించారు.
'ఎలా ఉద్యోగానికి పోతావ్' అంటూ బెదిరింపులకు దిగడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన చింటు ' ఐ మిస్ యూ నాన్న, పరువు పోయింది' అంటూ తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి గ్రామశివారులోని పొలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2023లో ఇండియన్ ఆర్మీలో చేరిన చింటు శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే ఇంటికి వచ్చాడు. జులై 3న తిరిగి వెళ్లేలోపు ఈ ఘటన జరిగింది.