Ind vs Aus Super 8 2024:టీ20 వరల్డ్కప్ సూపర్- 8లో కీలకమైన భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్కు వర్షం ముప్పుపొంచి ఉంది. మ్యాచ్ జరగాల్సి ఉన్న వెస్టిండీస్ సెయింట్ లుసియా ప్రాంతాన్ని సోమవారం ఉదయం నుంచే మబ్బులు కప్పేశాయి. అక్కడ రోజంతా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం 70శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో మ్యాచ్ పూర్తిగా జరగడం కష్టమేనని తెలుస్తోంది.
ఒకవేళ మ్యాచ్ సమయానికి వర్షం తీవ్రంగా అంతరాయం కలిగిస్తే, ఓవర్లు తగ్గించి ఆటను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తారు. అది సాధ్యం కాకపోతే మ్యాచ్ను రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. ఈ క్రమంలో 5 పాయింట్లతో భారత్ సెమీస్ చేరుకుంటు. మరోవైపు ఆసీస్, బంగ్లాదేశ్- అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.