Nayanarara Donation For Wayanad: కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనలో ఇప్పటికే 3వందలకుపైగా మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందించారు. అలాగే 'లక్కీ భాస్కర్' మూవీ టీమ్ కూడా రూ. 5లక్షలు సాయం ప్రకటించింది.
కాగా, ఇప్పటికే కోలీవుడ్ నుంచి విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి రూ.50 లక్షలను అందించారు.