ETV Bharat / snippets

వయనాడ్ విషాదం- విరాళం ప్రకటించిన నయనతార, విఘ్నేశ్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 7:42 AM IST

Nayanarara Donation
Nayanarara Donation (Source: ANI)

Nayanarara Donation For Wayanad: కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనలో ఇప్పటికే 3వందలకుపైగా మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు విరాళంగా అందించారు. అలాగే 'లక్కీ భాస్కర్' మూవీ టీమ్ కూడా రూ. 5లక్షలు సాయం ప్రకటించింది.

కాగా, ఇప్పటికే కోలీవుడ్ నుంచి విక్రమ్​ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి రూ.50 లక్షలను అందించారు.

Nayanarara Donation For Wayanad: కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనలో ఇప్పటికే 3వందలకుపైగా మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు విరాళంగా అందించారు. అలాగే 'లక్కీ భాస్కర్' మూవీ టీమ్ కూడా రూ. 5లక్షలు సాయం ప్రకటించింది.

కాగా, ఇప్పటికే కోలీవుడ్ నుంచి విక్రమ్​ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి రూ.50 లక్షలను అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.