JEE Advanced Results 2024 Released : దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేసేందుకు రాసే ప్రతిష్ఠాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. గత నెల 26న జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీ ను ఇటీవల విడుదల చేసిన ఐఐటీ మద్రాస్, తాజాగా తుది కీతో పాటు JEE Advanced Resultsను ప్రకటించింది. ఈ రిజట్స్ను results.jeeadv.ac.in వెబ్సైట్లో చూడొచ్చు.
ఈ సారి ఈ ఎగ్జామ్ను సుమారు 2 లక్షల మంది రాయగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది ఉన్నారు. బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్తంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ జూన్ 10 నుంచి జులై 23 వరకు కొనసాగనుంది.