Vellalore Dump Yard Fire Expense : తమిళనాడులోని వెల్లలూరు డంపింగ్ యార్డ్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు చేసిన ఖర్చుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం రూ.76.70 లక్షలు అయితే, కేవలం సిబ్బంది టీ, కాఫీ, ఆహారం, పండ్లు కోసం రూ.27.51 ఖర్చు చేశారు. ఈ మేరకు కోయంబత్తూర్ కార్పొరేషన్ కౌన్సిలర్ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఆమోదం లభించింది.
కోయంబత్తూర్ కార్పొరేషన్ను కింద ఉన్న అన్ని వార్డుల నుంచి చెత్తను సేకరించి వెల్లలూరు డంపింగ్ యార్డ్కు తీసుకొస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6-17 వరకు ఆ డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది చేసిన ఖర్చులపై ఆమోదం తెలిపేందుకు తీర్మానాన్ని ఈ ప్రవేశపెట్టారు.