ETV Bharat / snippets

బిహార్​లోని సిద్ధనాథ్​ ఆలయంలో తొక్కిసలాట - ఏడుగురు మృతి!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 7:32 AM IST

Updated : Aug 12, 2024, 8:31 AM IST

Stampede In Bihar
Stampede In Bihar (ANI)

Stampede In Bihar : బిహార్‌ జెహనాబాద్​ జిల్లాలోని బాబా సిద్ధనాథ్​ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముందుగా కన్వారియాల మధ్య వాగ్వాదం జరిగిందని, చివరికి అది తొక్కిసలాటకు దారితీసిందని జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పాండే తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Stampede In Bihar : బిహార్‌ జెహనాబాద్​ జిల్లాలోని బాబా సిద్ధనాథ్​ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముందుగా కన్వారియాల మధ్య వాగ్వాదం జరిగిందని, చివరికి అది తొక్కిసలాటకు దారితీసిందని జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పాండే తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Aug 12, 2024, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.