Man Shoots Mother And Daughter : పంజాబ్లోని బర్నాలాలో ఒకే ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. సంగేరా రోడ్కు చెందిన అకాలీదళ్ నేత కుల్వీర్ సింగ్ మాన్ తన తల్లి, కుమార్తెను తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంట్లోని పెంపుడు కుక్కను చంపేసి తానూ బలవన్మరణం చెందాడు. ఘటనా సమయంలో కుల్వీర్ భార్య రమణదీప్ పాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. ఆమె తిరిగొచ్చేసరికి తాళాలు వేసి ఉండడం వల్ల వాచ్మెన్ సహాయంతో ఇంట్లోకి వెళ్లింది. మృతదేహాలు చూసి భయపడి పోలీసులకు సమాచారమిచ్చింది. కుల్బీర్ కుమార్తె నిమ్రత్ కౌర్ ఇటీవల కెనడా నుంచి వచ్చింది. ఈ ఘటనపై డీఎస్పీ సత్వీర్ సింగ్ మీడియాతో మట్లాడారు. కుల్వీర్ సింగ్ చాలా కాలంగా డిప్రెషన్లో ఉన్నాడని, మందులు వాడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.
తల్లి, కూతురు, కుక్కను చంపి ఆ పార్టీ నేత బలవన్మరణం- పాల కోసం వెళ్లి బతికిపోయిన భార్య!
Published : Jun 23, 2024, 3:14 PM IST
Man Shoots Mother And Daughter : పంజాబ్లోని బర్నాలాలో ఒకే ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. సంగేరా రోడ్కు చెందిన అకాలీదళ్ నేత కుల్వీర్ సింగ్ మాన్ తన తల్లి, కుమార్తెను తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంట్లోని పెంపుడు కుక్కను చంపేసి తానూ బలవన్మరణం చెందాడు. ఘటనా సమయంలో కుల్వీర్ భార్య రమణదీప్ పాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. ఆమె తిరిగొచ్చేసరికి తాళాలు వేసి ఉండడం వల్ల వాచ్మెన్ సహాయంతో ఇంట్లోకి వెళ్లింది. మృతదేహాలు చూసి భయపడి పోలీసులకు సమాచారమిచ్చింది. కుల్బీర్ కుమార్తె నిమ్రత్ కౌర్ ఇటీవల కెనడా నుంచి వచ్చింది. ఈ ఘటనపై డీఎస్పీ సత్వీర్ సింగ్ మీడియాతో మట్లాడారు. కుల్వీర్ సింగ్ చాలా కాలంగా డిప్రెషన్లో ఉన్నాడని, మందులు వాడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.