ETV Bharat / snippets

బిహార్​ మాజీ మంత్రి తండ్రి దారుణ హత్య- కత్తులతో పొడిచి మర్డర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 11:33 AM IST

Bihar Former Minister Father Murder
Bihar Former Minister Father Murder (ETV Bharat)

Bihar Former Minister Father Murder : బిహార్​ మాజీ మంత్రి, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధ్యక్షుడు ముకేశ్ సహానీ తండ్రిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం దర్భంగా జిల్లా సుపాల్​ బజార్​లోని ముకేశ్ సహానీ నివాసంలో ఆయన తండ్రి జితన్ సహాని మృతదేహాం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఆయన కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు, గాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీనియర్‌ అధికారుల బృందం ఘటనాస్థలికి చేరుకుని ఈ హత్యపై దర్యాప్తు చేపడుతోందని దర్భంగా ఎస్​పీ జగనాథ్‌ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, ఘటన జరిగిన సమయంలో ముంబయిలో ఉన్న ముకేశ్ సహానీ తండ్రి మరణవార్తను విని వెంటనే ఇంటికి బయలుదేరారు.

ముకేశ్ సహానీ 2020 వరకు నీతీశ్ కేబినెట్​లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో విభేదాలు ఏర్పడి ఎన్​డీఏ నుంచి బయటకి వచ్చి, ఇండియా కూటమిలో చేరారు.

Bihar Former Minister Father Murder : బిహార్​ మాజీ మంత్రి, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధ్యక్షుడు ముకేశ్ సహానీ తండ్రిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం దర్భంగా జిల్లా సుపాల్​ బజార్​లోని ముకేశ్ సహానీ నివాసంలో ఆయన తండ్రి జితన్ సహాని మృతదేహాం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఆయన కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు, గాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీనియర్‌ అధికారుల బృందం ఘటనాస్థలికి చేరుకుని ఈ హత్యపై దర్యాప్తు చేపడుతోందని దర్భంగా ఎస్​పీ జగనాథ్‌ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, ఘటన జరిగిన సమయంలో ముంబయిలో ఉన్న ముకేశ్ సహానీ తండ్రి మరణవార్తను విని వెంటనే ఇంటికి బయలుదేరారు.

ముకేశ్ సహానీ 2020 వరకు నీతీశ్ కేబినెట్​లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో విభేదాలు ఏర్పడి ఎన్​డీఏ నుంచి బయటకి వచ్చి, ఇండియా కూటమిలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.