ETV Bharat / snippets

పీఓకేలో అదుపు తప్పి లోయలో పడ్డ జీపు - ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 8:22 PM IST

At Least 14 Including 6 Children Dead, 2 Injured As Jeep Plunges Into Ravine In PoK
14 Died In Jeep Accident In PoK (ANI)

14 Died In Jeep Accident In PoK : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హిమాలయ పర్వత రహదారి గుండా ప్రయాణిస్తున్న జీప్‌ అదుపు తప్పి నీలం లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందగా, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించినవారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పాక్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రజల సాయంతో, ఆస్పత్రికి తరలించామని సామాజిక కార్యకర్త మీర్‌ అతీక్‌ తెలిపారు. గత నెలలో ఇదే జిల్లాలో ఓ వ్యాన్‌ నదిలో పడి 16 మంది మృతి చెందారు. పీఓకేలో రోడ్లు అధ్వానంగా ఉండటంతో పాటు, ట్రాఫిక్‌ చట్టాల అమలు, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లనే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

14 Died In Jeep Accident In PoK : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హిమాలయ పర్వత రహదారి గుండా ప్రయాణిస్తున్న జీప్‌ అదుపు తప్పి నీలం లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందగా, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించినవారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పాక్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రజల సాయంతో, ఆస్పత్రికి తరలించామని సామాజిక కార్యకర్త మీర్‌ అతీక్‌ తెలిపారు. గత నెలలో ఇదే జిల్లాలో ఓ వ్యాన్‌ నదిలో పడి 16 మంది మృతి చెందారు. పీఓకేలో రోడ్లు అధ్వానంగా ఉండటంతో పాటు, ట్రాఫిక్‌ చట్టాల అమలు, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లనే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.