నెల్లూరు జిల్లాలో వాలంటీర్​ దాష్టీకం - రాత్రివేళ ఇంటికెళ్లి వృద్ధ దంపతులపై దాడి - వృద్ధ దంపతులపై వాలంటీర్​ దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 10:14 PM IST

Volunteer Attack on Old Couples: రాష్ట్రంలో వాలంటీర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్​ వృద్ధ దంపతులపై దాడికి దిగాడు. దాడి చేయడమే కాకుండా కత్తితో బెదిరించాడని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవహర శైలి సరిగా లేదని, వారే  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

బాధితుల వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరు కండ్రిగలో వెంకటరమణమ్మ - వెంకటరమణయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి సమయంలో వాలంటీర్​ హరీశ్ ఇంటికి​ వచ్చి దాడి చేశాడని వృద్ధ దంపతులు వివరించారు. హరీశ్​ తమపై దాడి చేసిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు. తమపై దాడి చేసిన అనంతరం కత్తితో బెదిరించాడని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కోవూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వాలంటీర్లు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు, దౌర్జన్యాలకు దిగుతున్నారని వృద్ధ దంపతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.