సింహాచలంలో వైభవంగా వరద పాయసం మహోత్సవం - Varada Payasam Mahostavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 4:48 PM IST

thumbnail
సింహాచలంలో వైభవంగా వరద పాయసం మహోత్సవం (ETV Bharat)

Varada Payasam Mahostavam in Simhachalam in Visakha District : విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వరద పాయసం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఏటా వరద పాయస మహోత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయానికి ఉత్తరాన ఉన్న వైకుంఠ మెట్టపై వెలిసిన శ్రీమన్నారాయణ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పొర్లు బండమీద  పోశారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాస్​ మూర్తి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

వరద పాయస మహోత్సవాన్ని నిర్వహిచడం వల్ల రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడతాయని భక్తుల నమ్మకం. ఈ వరద పాయస మహోత్సవాన్ని స్వామి వారి సుప్రభాత సేవలతో ప్రారంభిస్తారు. అనంతరం అతి పురాతనమైన వైకుంఠనాథుడు విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. అనంతరం పొర్లు బండమీద వరద పాయసాన్ని వేస్తారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.