ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి- జగన్ ప్రభుత్వంపై ఐక్య విద్యార్థి సంఘాల ఆగ్రహం - విద్యార్థి సంఘాలు విలేకర్ల సమావేశం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-03-2024/640-480-20900863-thumbnail-16x9-jac-state-president-united-student-union-fires-on-govt-in-prakasam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 4:44 PM IST
United Student Union Fires On Govt in Prakasam District : ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎల్భీజీ భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగదీష్, వినోద్ మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్లో (Pending) ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న హాస్టల్ (Hostel) మెస్ చార్జీలు విడుదల చేయాలని చెప్పారు. జిల్లాలో మూసివేసిన 266 ఎయిడెడ్ విద్య సంఘాలను తిరిగి తెరిపించాలని, వాటి అభివృద్ధికి అడ్డంగా ఉన్న జీవో నెంబర్ 35, 36, 42 ను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. యూనివర్సిటీ త్రిబుల్ ఐటీలకు సొంత భవనాలు నిర్మించాలని విన్నవించుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 11వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిరసన, దీక్షలు చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.