కువైట్ అగ్ని ప్రమాదం మృతుల్లో ఏపీ వాసులు - AP Residents Dead in Kuwait - AP RESIDENTS DEAD IN KUWAIT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 3:17 PM IST
Three AP Residents Dead in Kuwait Fire Accident : కువైట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు ఏపీ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ( జూన్ 14న) దిల్లీకి చేరుతాయని పేర్కొన్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏపీఎన్ఆర్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
లోకనాథం మంగళవారం రాత్రి (జూన్ 11న) కువైట్లోని ఓ అపార్ట్మెంటు వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈ లోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ( జూన్ 13న) ఆయనకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకబు చేయడంతో మరణించిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.