LIVE: ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్‌ షో - ప్రత్యక్ష ప్రసారం - Team India Cricketers Road Show

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 5:34 PM IST

Updated : Jul 4, 2024, 7:40 PM IST

thumbnail

Team India Cricketers Road Show in Mumbai: టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమిండియా 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్‌ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్‌ సేన గురువారం ఉదయం దిల్లీ ఎయిర్​ పోర్ట్​కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్​కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు టీమ్ఇండియా ప్లేయర్లు బయల్దేరారు. ప్రధానితో భేటీ అయ్యాక టీమ్ఇండియా స్పెషల్ ఫ్లైట్​లో ముంబయికి చేరుకుంది. ప్రస్తుతం ఆటగాళ్లంతా భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలో రోడ్​ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్‌ షోలో పాల్గొన్నారు. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2 కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓపెన్‌ టాప్‌ బస్సులో ముంబయిలో టీమిండియా క్రికెటర్ల రోడ్‌ షో ప్రత్యక్ష ప్రసారం. 

Last Updated : Jul 4, 2024, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.