LIVE: పిన్నెల్లి పైశాచికంపై టీడీపీ నేతల పుస్తకావిష్కరణ - ప్రత్యక్ష ప్రసారం - TDP Leaders Launch Book - TDP LEADERS LAUNCH BOOK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 1:07 PM IST
|Updated : May 29, 2024, 1:33 PM IST
TDP Leaders Launch Book on Pinnelli Anarchy Live: పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడి మాఫియాపై తెలుగుదేశం పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఏళ్లుగా మాచర్లలో సోదరులు చేసిన అరాచకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు, దాష్టీకాలను వివరించింది. అదే సమయంలో పిన్నెల్లి అక్రమార్జనను సైతం పేర్కొంది.‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో తెలుగుదేశం 28 పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని టీడీపీ పార్టీ ధ్వజమెత్తింది. ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వేధించారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లి దోపిడీ రూ. 2 వేల కోట్లని ఆరోపించింది.
Last Updated : May 29, 2024, 1:33 PM IST