జగన్‌ ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన : యనమల - Yanamala Ramakrishna Fire on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 7:03 PM IST

thumbnail
జగన్‌ ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన : యనమల (ETV Bharat)

TDP Leader Yanamala Ramakrishna Fire on Jagan Govt: జగన్‌ రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌పై వైఎస్సార్​సీపీ నేతలకు అవగాహన లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ చట్టవిరుద్ధమంటూ వైఎస్సార్​సీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయిదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వం వల్లనే ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని యనమల పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై 7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని పీల్చారని దుయ్యబట్టారు. జగన్‌ ముఠా లక్షల కోట్లు దోచుకుని తమ ఆదాయం పెంచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, భూములే కాకుండా రాష్ట్ర సచివాలయాలు సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి చరిత్ర వైఎస్సార్​సీపీ నేతలదని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.