అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగులబెట్టింది వైసీపీ నేతలే :ఎమ్మెల్యే నక్కా ఆనంద్​బాబు - Nakka Anand Babu Fire on YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 3:47 PM IST

Updated : Aug 16, 2024, 4:06 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ నేతలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిట్టనిలువునా తగలబెట్టారు:నక్కా ఆనంద్​బాబు (ETV Bharat)

TDP Leader Nakka Anand Babu Fire on YSRCP Leaders : డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు ఆడుతున్న మహానాటకానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్​బాబు అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు ఆ పార్టీ రంగులేసి, ధ్వంసం చేసినప్పుడు ఈ నేతలంతా ఏమయ్యారని నిలదీశారు. దళితులకు చెందిన 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు ఒక్కరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 

Jagan Name Remove At Ambedkar Statue : అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగన్ పేరు పెట్టుకుంటే నోరు ఎందుకు మెదపలేదని నక్కాఆనంద్‌బాబు దుయ్యబట్టారు. 47 వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినప్పుడు ఈ నేతల నోళ్లు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్ కలుస్తామంటూ విహార యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ అభిమానులే జగన్ పేరు పీకేశారని, వారిని తాను అభినందిస్తున్నానని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిట్టనిలువునా తగలబెట్టారని నిప్పులు చెరిగారు. అంబేద్కర్​ని అడుగడుగునా అవమానించిన వైఎస్సార్సీపీ నేతలకు ఆయన పేరెత్తే అర్హత కూడా లేదని ఆయన వెల్లడించారు.

Last Updated : Aug 16, 2024, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.