టీడీపీ కార్యకర్త దారుణ హత్య - వేట కొడవళ్లతో నరికి చంపిన వైఎస్సార్సీపీ మూకలు - TDP Activist Brutally Murdered - TDP ACTIVIST BRUTALLY MURDERED
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-06-2024/640-480-21676337-thumbnail-16x9-tdp-activist-brutally-murdered.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 10:53 AM IST
TDP Activist Brutally Murdered by YSRCP Activists: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిని వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కల్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచార సమయం నుంచి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య వైరం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందో బస్తు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం గిరినాథ్ చౌదరి, సోదరుడు కల్యాణ్ తమ ఇంటికి వెళ్తుండగా వైఎస్సార్సీపీ వర్గీయులు వారిపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. గిరినాథ్ తలపై తీవ్ర గాయమైంది. కల్యాణ్ సైతం దాడిలో గాయపడ్డారు. ఇద్దరినీ వెల్దుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా గిరినాథ్ మార్గమధ్యలో మృతి చెందారు. కల్యాణ్ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ బొమ్మిరెడ్డిపల్లికి చేరుకుని పరిశీలించారు. తిరిగి ఎలాంటి దాడులు జరగకుండా బందో బస్తు చేపట్టాలని ఎస్సై చంద్రశేఖర్రెడ్డికి సూచించారు.