ప్రైవేట్ స్కూల్బస్ బోల్తా - 15 మంది విద్యార్థులకు గాయాలు - SCHOOL BUS OVERTURNED - SCHOOL BUS OVERTURNED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 12:26 PM IST
School bus Overturned in Ichchapuram : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సత్యసాయి ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో సుమారు 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. మార్గమధ్యంలో మలుపు ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకొస్తున్న సమయంలో ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు బోల్తా పడటంతో భయాందోళనకు గురైన డ్రైవర్ బస్సును అలాగే విడిచిపెట్టి పారిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు, కండక్టర్ బస్సు అద్దాలను పగలగొట్టి చిన్నారులను బయటకు తీశారు.
గతంలో నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై స్కూల్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.