వసతి గృహంలో వరుస ఆత్మహత్యలు- తల్లిదండ్రుల ఆందోళన - Student Suicide In Hostel Palnadu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 3:36 PM IST

Updated : Aug 5, 2024, 3:47 PM IST

thumbnail
వసతి గృహంలో వరస ఆత్మహత్యలు- తల్లిదండ్రుల ఆందోళన (ETV Bharat)

Engineering Student Suicide by Hanging In Hostel At Palnadu District : పల్నాడు జిల్లా మాచర్లలో న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రేణుక ఎల్లమ్మ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వసతి గృహంలో స్నేహితులు లేని సమయంలో గదిలోని ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్​గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం  నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గత నెలలో ఇదే కళాశాలలో ఓ విద్యార్థి అత్మహత్యకు పాల్పడ్డారు. వరుస ఆత్మహత్యలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

ఇటీవల కర్నూలులోని ట్రిపుల్ ఐటీలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాయికార్తీక్ నాయుడు అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలోని వసతిగృహం 9వ అంతస్థుపై నుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలచివేస్తున్నాయి.

Last Updated : Aug 5, 2024, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.