రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు: స్పీకర్​ అయ్యన్నపాత్రుడు - Ayyanna Patrudu Visit Anna Canteen

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 3:49 PM IST

thumbnail
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం: స్పీకర్​ అయ్యన్నపాత్రుడు (ETV Bharat)

Speaker Ayyanna Patrudu Visit Anna Canteen in Anakapalle: రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నీ ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ శాసన సభాధిపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సిద్ధమవుతున్న అన్న క్యాంటీన్ భవనాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు రెండు రూపాయలకే భోజనం అందించే పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టగా దాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా చోట్ల విధ్వంసాలకు పాల్పడి నీరు కార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నాటికి పునర్నిర్మాణం చేసి వాటిని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నంలోని అన్న క్యాంటీన్​ను అంతకుముందే వినియోగంలోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. అసెంబ్లీలో జెండా వందన కార్యక్రమం ఉండటంతో 15వ తేదిన అందుబాటులో ఉండటం లేదని అందుకోసం నర్సీపట్నంలో ముందుగానే ప్రారంభించనున్నట్లు అయ్యన్న తెలిపారు. అందుకు క్యాంటీన్​కు సంబంధించిన పెండింగ్ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులను అయ్యన్న ఆదేశించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.