జోగి రమేశ్‌ కరోనా కంటే ప్రమాదకరం: బోడె ప్రసాద్‌ - Tdp Candidate Bode Prasad - TDP CANDIDATE BODE PRASAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 12:20 PM IST

Penumalur Constituency Tdp Candidate Bode Prasad : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయంలో జరిగిన అభివృద్ధి తప్ప వైఎస్సార్సీపీ పాలనలో చేసిందేమీ లేదని పెనుమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్‌ మండిపడ్డారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి జోగి రమేశ్‌ కరోనా కంటే ప్రమాదకరమని విమర్శించారు. కరోనా అన్నా రెండు సంవత్సరాలు పీడించి వదిలింది కానీ వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేసే వరకూ వదలడని మండిపడ్డారు.

రైతులు, విద్యార్థులు, మహిళలకు టీడీపీ మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్లు బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అట్టడుగుకు తీసుకువెళ్లిన ఘనత జగన్ సర్కార్​దే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి  చేసి ఉంటే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చేవని కానీ దానికోసం వైఎస్సార్సీపీ సర్కార్ కృషి చేయలేదని మండిపడ్డారు.  పెనమలూరు ఓటర్లు గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్న కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌తో విజయవాడలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.