వరి విత్తనాలు వచ్చేశాయ్- దుకాణాల వద్ద బారులుదీరిన రైతులు - Paddy Seeds

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 7:36 PM IST

thumbnail
వరి విత్తనాలు వచ్చేశాయ్- దుకాణాల వద్ద బారులుదీరిన రైతులు (ETV Bharat)

Paddy Seeds Available to Farmers in Narsaraopeta Division : పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నరసరావుపేట, రొంపిచర్ల మండలాల రైతులు వరి సాగు చేసేందుకు విత్తనాలను అందుబాటులోకి తెచ్చినట్లు వ్యవసాయ అధికారి పి.మస్తానమ్మ తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో రైతులు వరి నాట్లు వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.  

దీంతో 5 వేల హెక్టార్లకు 3,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమన్నారు. అందుకు బదులుగా 6 వేల క్వింటాళ్ల విత్తనాలు రైతుల కోసం తెచ్చినట్లు మస్తానమ్మ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలను సులువుగా కొనుగోలు చేసే విధంగా నగరంలోని టౌన్ హాల్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసేందుకు దుకాణం వద్ద బారులు తీరారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా గంటల తరబడి లైన్లలో వేచి చూశారు. నాలుగు రోజుల నుంచి తిండి, నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నామని విత్తనాలు అందించాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.