నెల్లూరులో మైనింగ్‌ మాఫియా- ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వైఎస్సార్సీపీ అక్రమాలు - illegal mining of quartz

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 5:24 PM IST

thumbnail
నెల్లూరులో మైనింగ్‌ మాఫియా- ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వైఎస్సార్సీపీ అక్రమాలు (ETV Bharat)

Owner Complaint to CID about Illegal Mining of Quartz Mines : నెల్లూరు జిల్లాలో గత ఐదేళ్లలో అధికారం అండతో చెలరేగిపోయిన వైసీపీ మైనింగ్‌ మాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వైసీపీ పెద్దల వేధింపులకు గురయ్యామని సైదాపురానికి చెందిన క్వార్జ్‌ గనుల యజమాని సీఐడీ డీఎస్పీకి అక్రమాలకు సంబంధించిన వివరాలను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తమ పేరిట ఉన్న గనుల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా తవ్వకాలు జరిపి మట్టి, ఖనిజాన్ని తరలించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది అధికార బలంతో మైనింగ్​ను​ అక్రమంగా చేజిక్కించుకున్నారని తెలిపారు. ఈ ఖనిజాన్ని విదేశాలకు భారీగా తరలించారని సాక్ష్యాధారాలతో దస్త్రాలను అధికారులకు సమర్పించారు. 

అలాగే 500 నుంచి 800కోట్ల టన్నుల క్వార్జ్ తవ్వేసి అమ్ముకున్నారని తెలిపారు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే స్థానిక వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు తెగబడ్డారని వివరించారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై హైకోర్టులో కేసు వేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ఇప్పటికైన వారిపై చర్యలు తీసుకోవాలని క్వార్జ్‌ గనుల యజమాని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.