LIVE: విజయవాడలో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
|Updated : 37 minutes ago
Nari Shakti Vijayotsavam Celebrations in Vijayawada: విజయవాడలో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. మహిళలు విద్యావంతులు, ఉద్యోగులు, పాలకులుగా అనేక రంగాలలో తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. కుటుంబాన్ని ఒంటి చేత్తో నిర్వహించే మగువలు, పాలించే సత్తా ఉన్నారనేది పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పటికే చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల కల్పనకు ముందడుగు పడటం మరో శుభపరిణామం. సాధికారతకు పరితపించే మహిళామూర్తులు, తమ సత్తా చాటేందుకు లభించిన ప్రతి వేదికను చక్కగా వినియోగించుకుంటున్నారు.ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత సైతం పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు ఏపీ గవర్నర్ సతీమణి సమీరా నజీర్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, హోంశాఖ మంత్రి అనిత, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భార్యలు, మహిళా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
Last Updated : 37 minutes ago