అత్తింటివారి చిత్రహింసలు భరించలేక- గర్భిణీ ఆత్మహత్య - pregnant woman suicide - PREGNANT WOMAN SUICIDE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-06-2024/640-480-21618414-thumbnail-16x9-mother-in-law-harassment.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 7:47 PM IST
Mother in Law Harassment led to Suicide of Pregnant Woman : వారసుడు కావాలని అత్తింటి వారి వేధింపులు తాళలేక నిండు గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని పెనమలూరు మండలం రామలింగేశ్వర నగర్కు చెందిన చందు కావ్య శ్రీ (19) ఈరోజు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కామినేని హాస్పిటల్కు భర్త, తల్లిదండ్రులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై కావ్యశ్రీ తల్లి రాజేశ్వరి మాట్లాడుతూ, తన కుమార్తెకు మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది. రెండో కాన్పులో కూడా అమ్మాయి పుడుతుందేమోనని వారి అత్త, భర్త మానసికంగా వేధించారని మృతురాలి తల్లి రాజేశ్వరి ఆరోపించారు. తన కూతురిని అబార్షన్ చేయించుకోమని అనేకసార్లు ఒత్తిడి చేశారని వాపోయారు. తన కూమార్తె నిరాకరించడంతో అత్త బలవంతం పెట్టినట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన అల్లుడు పాతపాడు సచివాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్నాడని తెలిపారు. తన కూమార్తెకు అబార్షన్ చేయించడానికి తన కుమార్తెను ఆస్పత్రుల చుట్టూ తన అల్లుడు తిప్పాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పాప పుట్టి పది నెలలు కూడా అవలేదు ఇప్పుడు మళ్లీ అబార్షన్ వద్దు అని మేము ఎంత వారించినా అల్లుడు తమ మాట వినకపోవడం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి ఆరోపించారు.