By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 12:28 PM IST
వైఎస్సార్సీపీ భూ దోపిడీలో బడా నేతల పాత్ర- చట్టపరంగా చర్యలు తప్పవు: మంత్రి రాంప్రసాద్రెడ్డి - Minister Ramprasad Reddy on YSRCP
Minister Ramprasad Reddy on YSRCP Leaders Anarchies : గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నేతలు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని దీనిలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై చట్టపరంగా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్ శాఖ అక్రమాల్లో గత ప్రభుత్వంలోని బడా నేతల పాత్రపై విచారణ జరుగుతోందని మంత్రి రాంప్రసాద్రెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మఠాల భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా అన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపి త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రెవెన్యూ, దేవాదాయ అధికారులు దీనిపై విచారణ ముమ్మరం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నింటినీ కూడా పెద్ధిరెడ్డే హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. ఇంకా ఎవరైనా తమ భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు చేస్తే తాము కాపాడతామని హామీ ఇచ్చారు. భూములు, ఇసుక, మైనింగ్ దోపిడీకి పాల్పడిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.