జగన్‌కు ప్యాలెసులంటే అమితమైన ప్రేమ: మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Ramprasad Reddy on YSRCP Office

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 4:26 PM IST

thumbnail
జగన్‌కు ప్యాలెసులంటే అమితమైన ప్రేమ: మంత్రి రాంప్రసాద్ రెడ్డి (ETV Bharat)

Minister Ramprasad Reddy Inspected YSRCP Office in Rayachoti: రాష్ట్రంలో పేదలు గూడు నిర్మించుకోలేక అవస్థలు పడుతుంటే రాజులు కూడా నిర్మించుకోలేనంత ఐశ్వర్యవంతమైన భవనాలను వైఎస్సార్​సీపీ నిర్మించుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని నిర్మిస్తున్న వైఎస్సార్​సీపీ కార్యాలయ భవనాలను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సొంత భవనాలను నిర్మించుకున్నారని ఆయన పేర్కొన్నారు. 

వైఎస్ జగన్​కు భవంతులు, ప్యాలెస్ అంటే అమితమైన ప్రేమని, అందుకే ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ స్థలాలను కొట్టేసి కోట్ల విలువైన వైఎస్సార్​సీపీ కార్యాలయాలను నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అడ్డదిడ్డంగా వైఎస్సార్​సీపీ కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను, అధికారం అండతో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించిన వైఎస్సార్​సీపీ నాయకులను కూడా వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మాదిరి జేసీబీలు తెచ్చి కూల్చడం తెలుగుదేశం పార్టీ విధానం కాదని ప్రజాధనంతో నిర్మించిన ఈ కార్యాలయాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.