By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 10:17 PM IST
'ఐదేళ్లుగా ప్రజలు హింసకు గురయ్యారు - ఇప్పుడొస్తున్న ఫిర్యాదులే దానికి సాక్ష్యం' - Grievance organized NMD Farooq
Minister NMD Farooq organized Grieven Cell Program : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పునేందుకు తరలివచ్చారు. వైసీపీ నాయకుల అరాచకాలు, భూదోపీడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతలు గత ఐదేళ్లుగా ఎంతలా హింసించారో అర్ధం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కరం కాలేదని ఎద్దేవా చేశారు. అందుకూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని తెలిపారు.
ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదులను వాటి శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. అలాగే కొందరు అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా సూచించారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ బాధితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అలాగే పార్టీ పరంగా పదవులు కోరుతూ కొన్ని దరఖాస్తులొచ్చాయని వాటిని కూడా పరిశీలించి కష్టపడ్డవారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు.