ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి ప్రారంభిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : 6 hours ago
Free Gas Cylinder Scheme Will Start From Diwali Festival : సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామని, రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకానికి ఆమోదం తెలపనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని అన్నారు. ఈ పథకానికి ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.