రెవెన్యూ అధికారుల వ్యవహారంతోనే- నకిలీ పట్టాలు ! - Land Grabing in YSR District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 6:55 PM IST

thumbnail

Land Grabing in YSR District : వైఎస్సార్​ జిల్లా బద్వేల్‌లో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదాలు, ఉదాసీనత, కబ్జాదారుల అరాచకాలకు ఊతమిస్తున్నాయి. నకిలీ పట్టాలు విచ్చలవిడిగా తయారవుతుండటంతో వివాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బద్వేలులోని (Badwel) ఓ స్థలం యజమాని, దాని అనుభవంలో ఉన్న మరో వ్యక్తి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. స్థలం వద్దే రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు (Attacks) చేసుకున్నారు. 

Revenue Officers Negligence in Forged Rails : అసలు ఇంటి స్థలం పట్టాలకు నకిలీ పట్టాలు తయారవడంతో రెండు వర్గాల మధ్య ఏర్పడ్డ వివాదం ఘర్షణకు దారితీసింది. రెవెన్యూ అధికారుల వ్యవహారంతోనే ఇలాంటి ఘర్షణలు చెలరేగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇటుకలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. రెవెన్యూ అధికారుల (Revenue Officers) నిర్లక్ష్యం కారణంగా ఇంత బాగోతం జరగడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.