By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 2:09 PM IST
సీఎం చంద్రబాబు ఫొటో లేకుండా సమీక్ష సమావేశం ఏర్పాటు - అధికారులపై టీడీపీ నేతలు ఆగ్రహం - Review Meeting without CM cbn Photo
Krishna District Officers Review Meeting without CM Chandrababu Photo : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు వైఎస్సార్సీపీ మూలాలను వదులుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 7 రోజులు అవుతున్నా జిల్లా యాంత్రంగం ఇంకా మేలుకోలేదు. నేడు కలెక్టరేట్లోని స్పందన హాల్లో రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో లేకుండానే సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో జగన్ సీఎం అవ్వగానే ఆఘమేఘాలపై ఆయన ఫోటోలు అధికారులు ఏర్పాటు చేశారు. అధికారులకు ఇంకా వైఎస్సార్సీపీ వాసనలు పొలేదని టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగితే సమాచార శాఖ వారు ఇవ్వలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గన్నవరం విమాశ్రయ భూ నిర్వసితులతో నిర్వహించిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు చేయలేదు. జిల్లా అధికారుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.