ఏయూ ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా ఆచార్య కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరణ - AU New incharge registrar
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 29, 2024, 1:51 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/640-480-21824700-thumbnail-16x9-au-new-incharge-registrar.jpg)
AU NEW INCHARGE REGISTRAR: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ఆచార్య కిషోర్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా జీవితం మొదలు పెట్టి ఇక్కడే అధ్యాపకునిగా చేరి ఇంఛ్ర్జి రిజిస్ట్రార్గా బాధ్యతలు తీసుకోవడంపై కిషోర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అకడమిక్ ఎఫైర్స్ డీన్గా పని చేసిన కిషోర్ బాబు, ఏయూ పరిపాలన విభాగంలో అనేక హోదాలలో పని చేశారు.
1984 లో పీజీ విద్యార్థిగా ఏయూలో విద్యార్థిగా మొదలు పెట్టీ, 1994 లో ఇక్కడే అధ్యాపకులుగా చేరి ఇంఛార్జి రిజిస్ట్రార్గా పదవి బాధ్యతలు చేపట్టారు. వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి అమరావతికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఇంఛార్జ్ వీసీ వచ్చిన తరవాత సమన్వయం చేసుకుని యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఇంఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య కిషోర్ తెలిపారు. కాగా ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య జేమ్స్ స్టీఫెన్ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.