By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 2:53 PM IST
రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందాం- రాష్ట్రవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టిన జనసేన కార్యకర్త
Janasena Party Follower Cycle Yatra In Prakasam District : ప్రకాశం జిల్లా కనిగిరిలో జనసేన (Janasena) అభిమాని సైకిల్ యాత్ర చేపట్టాడు. కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ పై తిరుగుతూ అధికార పార్టీ అరాచకాలను ప్రజలకు వివరించేందుకు యాత్ర చేస్తున్నట్లు ఏడుకొండలు తెలిపారు. సైకిల్ కి ముందు బాగాన జైశ్రీరామ్, జనసేన జెండాలను కట్టుకొని యాత్ర చేస్తున్నాడు. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని ఏడుకొండలు తెలిపారు.
సైకిల్కి రెండు వైపులా జనసేన జెండాలను కట్టుకొని తనదైన శైలిలో సైకిల్ యాత్ర చేస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యాత్ర చేస్తానంటూ జనసేన వీరాభిమాని ఏడుకొండలు తెలిపారు. రాష్ట్రంలోని అరాచక పాలనను తొలగించడంలో ప్రజలను తనవంతు ప్రయత్నంగా చైతన్య పరిచేందుకే యాత్ర చేస్తున్నట్లు యువకుడు ఏడుకొండలు తెలిపాడు. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) విజయభేరీ మోగిస్తుందని యువకుడు ఆశాభావం వ్యక్తం చేశాడు.