thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 8:24 PM IST

ETV Bharat / Videos

ఒకే ఇంటిలో 32 ఓట్లు - ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న టీడీపీ నేతలు

Irregularities in Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తుది జాబితాలో సైతం తప్పలు దొర్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుపతిలోని 162 పోలింగ్ కేంద్రంలో ఒకే ఇంటి చిరునామాతో 32 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అబ్బన్న కాలనీలో ఉన్న ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న కుటుంబసభ్యులతో టీడీపీ నేతలు మాట్లాడారు.  బీఎల్వోల సహకారంలో అధికార వైసీపీ ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. 

దొంగ ఓట్లపై అధికారులకు ఫిర్యాదులు చేసినా తొలగించలేదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. నగరంలోని రైల్వేకాలనీ, జీవకోన, కెనడినగర్‍, సంజయ్‍ గాంధీ కాలనీలలో అధికంగా దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. అధికార పార్టీకి అండగా ఉన్న అధికారులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల అధికారులతో తిరుపతిలో ఓటరు సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ ఓట్లకు సంబంధించి నగర పాలక సంస్ధ కమిషనర్‍తో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.