ETV Bharat / state

అడవిలో దారి తప్పిన శివస్వాములు - 4 గంటలు టెన్షన్​ - LORD SHIVA DEVOTEES LOST THEIR WAY

తెలంగాణ నుంచి శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర - దారి తప్పిన స్వాములు - పోలీసులకు సమాచారం - రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది

Lord Shiva Devotees Lost Their Way in Forest
Lord Shiva Devotees Lost Their Way in Forest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 10:51 AM IST

Lord Shiva Devotees Lost Their Way in Forest: తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్​కు చెందిన శివ స్వాములు కొందరు అడవిలో గూగుల్ మ్యాప్​ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లి దారి తప్పారు. విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్న రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే

ఇదీ జరిగింది: కొల్లాపూర్​కు చెందిన మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్​తో సహా మొత్తం ఏడుగురు ఇంద్రేశ్వరం బీట్ మీదుగా శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్తూ అడవిలో పాకశాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక దారి తప్పిపోయారు. తాము దారి తప్పిన విషయాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వారు పోలీసులకు ఫోన్ చేశారు.

ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూం ద్వారా తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రేంజర్ కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ఎఫ్​ఎస్​వో మగ్బుల్, ఎఫ్​బీవో మద్దిలేటి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా శివస్వాములు ఉండే లొకేషన్​కు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. వారిని సురక్షితంగా ఆత్మకూరుకు తీసుకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Lord Shiva Devotees Lost Their Way in Forest: తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్​కు చెందిన శివ స్వాములు కొందరు అడవిలో గూగుల్ మ్యాప్​ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లి దారి తప్పారు. విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్న రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే

ఇదీ జరిగింది: కొల్లాపూర్​కు చెందిన మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్​తో సహా మొత్తం ఏడుగురు ఇంద్రేశ్వరం బీట్ మీదుగా శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్తూ అడవిలో పాకశాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక దారి తప్పిపోయారు. తాము దారి తప్పిన విషయాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వారు పోలీసులకు ఫోన్ చేశారు.

ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూం ద్వారా తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రేంజర్ కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ఎఫ్​ఎస్​వో మగ్బుల్, ఎఫ్​బీవో మద్దిలేటి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా శివస్వాములు ఉండే లొకేషన్​కు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. వారిని సురక్షితంగా ఆత్మకూరుకు తీసుకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

శివభక్తులకు శుభవార్త -శైవ క్షేత్రాలకు 3,500 ప్రత్యేక బస్సులు

Success Secrets By Lord Shiva in Telugu: జీవితంలో విజయానికి.. మహా శివుడు చెప్పిన రహస్యాలివే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.