డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్పుపై హైకోర్టులో విచారణ - మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ - డీఎస్సీపరీక్షలపై హైకోర్టు వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-02-2024/640-480-20826675-thumbnail-16x9-high-court-refused-interim-order-petition-tet-and-dsc-exams.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 10:35 PM IST
High Court Refuses Interim Petition TET And DSC Exam: టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణ మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28న వ్యాజ్యంపై తుది విచారణ చేపడతామని తెలిపింది. టెట్ నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో నలుగురు అభ్యర్థులు పిటీషన్ వేశారు. ప్రిపేరయ్యేందుకు సమయం లేని కారణంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను మార్చాలని కోరారు.
పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.