పొంగుతున్న వాగులతో దెబ్బతిన్న రహదారులు- గుండె చేతపట్టుకుని ప్రయాణిస్తున్న గిరిజనులు - Heavy Rains Effect in Alluri Dist - HEAVY RAINS EFFECT IN ALLURI DIST
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 3:50 PM IST
Heavy Rains Effect in Alluri District: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి జలాశయాలను తలపిస్తున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వీలుకాక ప్రజలు నానావస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక గిరిజన ప్రాంతాల్లో ప్రజల అవస్థలైతే వర్ణనాతీతం.
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ ప్రజలు తాళ్ల సాయంతో ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు. వర్షాలు పడిన ప్రతిసారీ ఈ పరిస్థితి తప్పడం లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనలు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.