పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్​ షాక్​తో మృతి

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 9:55 PM IST

thumbnail

Groom Died With Current shock in Nirmal : మరోమూడు రోజులుకు పెళ్లికొడుకుగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్​ షాక్​తో మృతి చెందాడు. దీంతో అప్పటి వరకు పెళ్లి సందడితో ఆనందోత్సవాల మధ్య ఉన్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం నిర్మల్​ జిల్లా బెల్లల్​ గ్రామంలో మీరాల వినోద్​ అనే యువకుడుకి ఈ నెల 18న పెళ్లి జరగనుంది.

Groom Died With Geyser Shock in Nirmal : ఈ క్రమంలో ఇంట్లోని స్నానానికి వెళ్లిన వినోద్​ ప్రమాదవశాత్తు బాత్రుంలో గీజర్​తో విద్యుత్​ షాక్​కు గురై అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వినోద్​ను ఆసుపత్రికి తరిలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పెళ్లి కొడుకుగా పెళ్లిపీటలు ఎక్కాల్సింది పోయి, పాడె ఎక్కాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.