thumbnail

వైఎస్సార్సీపీ గుర్తింపును రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి- ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలి: జవహర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:27 PM IST

Former Minister KS Jawahar on AP Voter List: రాష్ట్ర తుది ఓటర్ల జాబితాలో పారదర్శకత లేదని మాజీ మంత్రి కేఎస్​ జవహర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల అండతో ప్రలోభాలకు లొంగి కొందరు అధికారులు లాగిన్ ఐడీలు ఇచ్చేస్థాయికి దిగజారారని మండిపడ్డారు. అనంతపురం ఎస్పీ, డీఐజీ, కొందరు కలెక్టర్లపై ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఓటర్లజాబితాలో అవకతవకలు, అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

"రాష్ట్ర తుది ఓటర్ల జాబితాలో పారదర్శకత లేదు. ప్రజాప్రతినిధుల అండతో ప్రలోభాలకు లొంగి కొందరు అధికారులు లాగిన్ ఐడీలు ఇచ్చేస్థాయికి దిగజారారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం." - జవహర్, మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.