By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 4:48 PM IST
పంటను దాచుకున్న రైతులకు పోలీసులు నోటీసులు - farmers received notices
Farmers Received Notice due to Warehouse Owner IP : ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటను సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని కొంతమంది రైతులు సరుకును గోదాములతో నిల్వ ఉంచారు. తీరా ఆ గోదాము యజమాని ఐపీ పెట్టడంతో రైతులకు సైతం నోటిసులు వెళ్లాయి. దీంతో అయోమయానికి గురైన రైతులు గోదాము వద్దకు చేరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెెళ్తే, పెద్దముడియం మండలం పెద్దపసుపులో శ్రీ గణేష్ రైతు మిత్ర రూరల్ వేర్హౌస్ గోదాము ఉంది. దీన్ని నలుగురు యజమానులు నిర్వహిస్తున్నారు. అయితే చంటి అనే యజమాని ఐపీ దాఖలు చేశారు. దీంతో యజమాన్యంతో పాటు పంటను నిల్వచేసుకున్న రైతులకు సైతం నోటీసులు వెళ్లాయి. దీంతో కంగారుపడ్డా అన్నదాతలు గోదాము వద్దకు చేరి చుట్టుముట్టారు.
తాము నిల్వచేసిన పంట ఉత్పత్తులు ఉన్నాయో లేదోనన్న ఆందోళనతో జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, పులివెందుల, వేంపల్లి తదితర ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చారు. దీంతో జమ్మలమడుగు గ్రామీణ సీఐ గోపాల్ రెడ్డి సిబ్బందితో చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలో తలుపులు తెరిచి శనగ, ధనియాలు, జొన్న బస్తాలను పరిశీలించారు. అలాగే కొంతమంది రైతులు యజమాన్ని నమ్మి లక్షల్లో డబ్బుల ఇచ్చారు. తీరా ఐపీ పెట్టి మోసం చేశారని రైతులు లబోదిబో మంటున్నారు.