త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరుతా: ఆమంచి కృష్ణమోహన్ - amanchi krishna mohan congress - AMANCHI KRISHNA MOHAN CONGRESS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21186179-thumbnail-16x9-amanchi-krishna-mohan-joining-congress-party.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 9:37 PM IST
Amanchi Krishna Mohan Joining Congress Party: బాపట్లజిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గ అభిమానులతో సమావేశం నిర్వహించారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరతానని ఆమంచి ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) అంటే తనకెంతో గౌరవమని తన భావజాలం కుదరకపోవడంతో టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయినట్లు తెలిపారు.
వైసీపీ (YSRCP) అధిష్ఠానం తనకు సముచితస్థానం ఇచ్చి పర్చూరు నుంచి పోటీ చేయమన్నారని ఆమంచి తెలిపారు. కొద్ది రోజులుగా చీరాలలో సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరిస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్లమని అభిమానులు సూచించారన్నారు. దీంతో అభిమానుల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఆటో గుర్తుతో మరోసారి స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్నా, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని అందువల్లనే కాంగ్రెస్లో చేరుతున్నారని ఆమంచి తెలిపారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తానని ఆమంచి కృష్ణమోహన్ ధీమా వ్యక్తం చేశారు.