పాస్ పోర్టు రెన్యువల్ చేయించిన వైఎస్ జగన్ - YS JAGAN AT PASSPORT OFFICE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 10:47 PM IST

thumbnail
పాస్ పోర్టు రెన్యువల్ చేయించిన వైఎస్ జగన్ (ETV Bharat)

Ex CM YS JAGAN Mohan Reddy AT PASSPORT OFFICE: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాస్​ పోర్టు కార్యాలయానికి వచ్చారు. పాస్ పోర్టును రెన్యువల్ చేసుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతితో కలసి విజయవాడలోని రీజినల్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ వారి పాస్ పోర్టు రెన్యువల్​కు సంబంధించి డాక్యుమెంట్లను, ఆధారాలను సమర్పించడం సహా వేలి ముద్రలు వేసి, ఐరీష్ పూర్తి చేశారు.  

అయితే ఈ పాస్ పోర్టు రెన్యువల్ ప్రక్రియను మొత్తం కేవలం 20 నిముషాల వ్యవధిలో అధికారులు పూర్తి చేశారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డికి భద్రత కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే కాన్వాయ్​లో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉన్నా ఆయన దాన్ని వినియోగించుకోవడం లేదు. తమ వ్యక్తిగత వాహనంలోనే జగన్ దంపతులు ఇద్దరూ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.