thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 7:01 PM IST

ETV Bharat / Videos

అధికారులు ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు- టిప్పర్ డ్రైవర్ల ఆందోళన - Interview With Sand Tipper Drivers

Interview With Sand Tipper Drivers : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉచిత ఇసుక పథకం అమలులో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం ఆదేశించినా, వైఎస్సార్సీపీ వాసనలు వీడని అధికారులు అక్రమార్కులకు వంత పాడుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు ఊతమిస్తూ అధికారిక ఇసుకను నిలుపేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాత్రి వేళల్లో చిత్రావతి నది నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ డంప్ యార్డులో వందలాది టిప్పర్ల ఇసుక నిల్వ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ కొందురు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నారు. 

ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి సమీపంలోని డంప్​లో ఇసుక నిల్వలు ఉన్నా అధికారులు లోడ్ చేయడం లేదు. చలాన్​ల చెల్లింపులను అనుమతించకుండా ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టిప్పర్లు రెండ్రోలుగా డంప్ వద్దే బారులు తీరాయి. తిండీతిప్పలు మానుకుని పడిగాపులు కాస్తున్నా అధికారులు స్పందించట్లేదంటున్న ఇసుక టిప్పర్ డ్రైవర్లతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.