ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం- ప్రయాణికులు ఏంచేశారంటే! - drunken man attacked conductor

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 10:06 AM IST

thumbnail
ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం- ప్రయాణికులు ఏంచేశారంటే! (ETV Bharat)

Drunken Man Attacked Bus Conductor: అన్నమయ్య జిల్లాలో ఓ మందుబాబుకి ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. చెన్నరాయుడు అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి మద్యం సేవించి కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో వైఎస్సార్ సర్కిల్​ వద్ద ఎక్కి, మంటపంపల్లికి టికెట్టు తీసుకున్నాడు. అయితే మంటపంపల్లి బస్టాండ్ వద్దకు బస్సు రాగానే చెన్నరాయుడు దిగకపోవడంతో కండక్టర్ బస్సు దిగమని కోరాడు. మద్యం మత్తులో ఉన్న చెన్నరాయుడు బస్సు దిగకుండా కండక్టర్​తో వాగ్వాదానికి దిగాడు. 

కనీసం టికెట్ అయినా తీసుకోమని కండక్టర్ చిన్నరాయుడుతో అనగా కండక్టర్​పై దాడికి దిగాడు. ఇదేమని ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై కూడా మద్యం మత్తులో ఉన్న చెన్నరాయుడు పాదరక్షతో దాడి చేసి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తోటి ప్రయాణికులు అందరూ చిన్నరాయుడికి దేహశుద్ధి చేసి, బస్సు నందలూరులోకి లాగానే పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. ఈ విషయంపై నందలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.