By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 7:27 PM IST
విశాఖ తీరంలో రాజ్నాథ్సింగ్ - 'డే ఎట్ సీ' కార్యక్రమంలో పాల్గొన్న రక్షణమంత్రి - Rajnath Singh Visit in Vizag
Defence Minister Rajnath Singh Visit in Vizag: కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్సింగ్ విశాఖ పర్యటనగా ఆయన చేరుకున్నారు. "డే ఎట్ సీ" కార్యక్రమంలో భాగంగా ఒక రోజంతా యుద్ధ నౌకపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గడపనున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖలో ఐఎన్ఎస్ డేగాకు మంత్రి చేరుకున్నారు. హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వా నౌకపై రక్షణ శాఖ మంత్రి దిగారు. జలస్వా నౌకకు వచ్చిన అనంతరం తూర్పు నౌకాదళ అధికారులు ఆయనకు ఘనంగా శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.
ఈస్ట్రాన్ ప్లిట్లో డే ఎట్ సీ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్ను ఆయన సందర్శించి నావికాదళం సన్నద్ధతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించనున్నారు. యుద్ద నౌకల సన్నద్దతను పరిశీలించి నౌకాదళ సిబ్బందికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తీరుపై సమీక్షలు జరపనున్నారు. ఈ సమీక్షల అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరనున్నారు.