thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 9:11 AM IST

ETV Bharat / Videos

మిగిలిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పునర్నిర్మాణం - భూసేకరణపై పెనుమాక రైతులతో చర్చలు - CRDA Officers met Penumaka farmers

CRDA Officers met Penumaka Farmers : సీఎం చంద్రబాబు ఆదేశాలతో  అమరావతి నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. మధ్యలోనే ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లిలో రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సర్వేను పూర్తి చేసిన సీఆర్డీఏ గురువారం భూయజమానులతో సమావేశమైంది. రహదారి నిర్మాణానికి తమ భూమి ఇచ్చేందుకు పెనుమాక రైతులు సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో తమకు ఇచ్చే ప్యాకేజీని పొడగించాలని డిమాండ్ చేశారు. 

భూసమీకరణలో ఇప్పటి వరకు ఎకరా భూమి ఇచ్చిన రైతుకు 1450 గజాల స్థలాన్ని పరిహారం కింద ఇచ్చేవాళ్లు. అయితే పెనుమాక రైతులు తమకు 2వేల గజాలను ఇవ్వాలని కోరారు. అయితే పాత పద్ధతిలోనే పరిహారం ఇస్తామని సీఆర్డీఏ అధికారులు రైతులకు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై సీఆర్డీఏ కమిషనర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు చెప్పారు. శుక్రవారం పెనుమాక, ఉండవల్లి రైతులతో సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రైతులు భూసమీకరణకు ముందుకు రాకపోతే భూసేకరణ ద్వారా భూములు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.