Published : Apr 22, 2024, 5:52 PM IST
|Updated : Apr 22, 2024, 6:33 PM IST
LIVE : మల్కాజిగిరిలో సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024
CM Revanth Reddy Election Campaign LIVE : రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఏకంగా మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో రేవంత్ ఆకస్మిక పర్యటనలు చేశారు. సునీత మహేందర్ రెడ్డి, ఆత్రం సుగుణ, జీవన్ రెడ్డి నేతల నామినేషన్ల కార్యక్రమాలకు హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమాలలో పాల్గొన్నడంతో పాటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనజాతర సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం బహిరంగ సభల్లో సీఎం పాల్గొన్నారు.
Last Updated : Apr 22, 2024, 6:33 PM IST